చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ గుర్రం తిరుపతి
నవతెలంగాణ – కాటారం
నేటి బాలలే రేపటి పౌరులుగా, నవ సమాజ నిర్మాణానికి పునాది కావాలని, బాల్య వివాహంతో బాలల భవిష్యత్తు మగ్గిపోకూడదని, తిరుపతి తెలియజేశారు. కాటారంలోని ట్రైబల్ పాఠశాల కళాశాల, ప్రభుత్వ పాఠశాలలో బాల్యవివాహాల నిర్మూలనకై బుదవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళ, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న DCPU,CHL,DHEW,SAKHi విభాగాల సమన్వయంతో చేపట్టడం జరిగింది.
నేటి బాలలే రేపటి పౌరులుగా, నవ సమాజ నిర్మాణానికి పునాది కావాలని, బాల్య వివాహంతో బాలల భవిష్యత్తు మగ్గిపోకూడదని, తిరుపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో DHEW నుండి అనూష , సఖి నుండి మాధవి, ఎన్జీవో నుండి శ్రీలత , తెలంగాణ సాంస్కృతిక సారధి నుండి శిరీష, ప్రవీణ్, కళా జాతర బృందం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, రాజలింగం, రాజేందర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



