నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జక్రాన్ పల్లి రైతువేదిక లో ఆయిల్ పామ్ పంట సాగు పైన అవగహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని దేవిక మేడం, హార్టికల్చర్ అధికారి రాజు మాట్లడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును పలు రకాల సబ్సిడీలతో సాగును ప్రోత్సహిస్తుందని, ఈ పంటను ఒకసారి నాటితే 4 సంవత్సరాల తర్వాత నిరంతర ఆదాయాన్ని 30సంవత్సరాల పాటు ఇస్తుందని,కోతులు , పందుల బెడద , దొంగల బెడద లేని తక్కువ కూలీలు అవసరమయ్యే పంట ఆయిల్ పామ్ అని తెలిపారు. ఎన్.ఎం.ఇ ఓ- ఓపి- స్కీమ్ కింద ఈ కింది సబ్సిడీలు ఉన్నాయి
1)మొక్కలకు 90%రాయితీ కింద రైతు కేవలం ఒక ఎకరానికి 1000 చొప్పున జిల్లా ఉద్యాన పట్టుపరిశ్రమ అధికారి నిజామాబాద్ పేరిట డీడీ చెల్లిస్తే 50 మొక్కలు ప్రీ యూనిక్ కంపెనీ వారిచే అందిస్తామని తెలిపారు.
2) ఆయిల్ పామ్ మధ్యలో అంతర పంటల సాగు(మొక్కజొన్న,జొన్న,పసుపు,కూరగాయలు,సోయా ) చేసినందుకు గాను ఎకరానికి 4200/ చొప్పున రైతు ఖాతాలో సంవత్సరానికి ఒకసారి జమ చేస్తున్నామని
3) ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు చిన్న, సన్నకారు, ఐదెకరాల లోపు ఉన్నవారికి 90% రాయితీ, ఎస్సీ ఎస్టీ రైతులైతే 100% రాయితీ,5 ఎకరాల మీదా సాగు చేసేవారు 80% రాయితీ కింద డ్రిప్ సౌకర్యం పొందవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైతులు, జక్రన్ పల్లి మండల ఏఈఓ శ్రీకాంత్, ప్రీ యూనిక్ కంపెనీ క్లస్టర్ ప్రతినిధి రాకేష్, అలానే గ్రామ ప్రతినిధులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.