Friday, June 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైద్యం వికటించి బాలింత మృతి..

వైద్యం వికటించి బాలింత మృతి..

- Advertisement -

ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన 
నవతెలంగాణ – కల్వకుర్తి 
: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించి బాలింత మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. రెండు రోజుల క్రితం పొలిటినొప్పులతో ఆస్పత్రిలో చేరిన వనజ మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ రావడంతో పరిస్థితి విషమించింది. ఆమెను వెంటనే హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించగా మంగళవారం రాత్రి మృతి చెందింది. వైద్యం వికటించడం వల్లే బాలింత మృతి చెందింది అంటూ కుటుంబ సభ్యులు బంధువులు బుధవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -