శంకర్ చేగూరి దర్శకత్వంలో బి. బాలకష్ణ, రమా శంకర్ నిర్మించిన చిత్రం ‘బద్మాషులు’. మహేష్ చింతల, విద్యాసాగర్, బలగం సుధా కర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, కవితా శ్రీరంగం, దీక్ష కోటేశ్వర్ కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఈనెల 6న రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో దర్శకులు తరుణ్ భాస్కర్, మాలిక్ రామ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ,’చాలామంది కామెడీని చాలా తేలిగ్గా తీసి పారేస్తుంటారు. కానీ ఆ కామెడీ సన్నివేశాలు వెనుక ఎంత కష్టం, నిజాయితీ దాగుందనేది చూసే వాళ్లకి అర్థం కాదు. ఆ సీన్లు రాసిన వాళ్లకే తెలుస్తుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’ అని అన్నారు. ‘తరుణ్ భాస్కర్ ఈ ప్రీ రిలీజ్కి వచ్చి ఈ చిత్రాన్ని మరో స్థాయికి పెంచారు. ఈ మూవీ రెండు గంటల పాటు ఫన్ రైడ్గా సాగుతుంది. నవ్విస్తూనే ఒక మంచి మెసేజ్ కూడా అందించాం’ అని చిత్ర డైరెక్టర్ శంకర్ చేకూరి చెప్పారు.
‘బద్మాషులు’రిలీజ్కి రెడీ
- Advertisement -
- Advertisement -