నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశంలో జనగణనతోపాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల బీసీటీఏ హర్షం ప్రకటించింది. ఈ మేరకు బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షులు కె కృష్ణుడు, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్గౌడ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంపీ ఆర్ కృష్ణయ్య ఉద్యమ ఫలితంగానే కేంద్రం బీసీ కులగణనకు అంగీకరించిందని తెలిపారు. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ను అమలు చేసేందుకు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కేంద్రానికి పంపించిందని పేర్కొన్నారు. ఈ బిల్లులను కేంద్రం ఆమోదించాలని కోరారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ను కల్పించాలని తెలిపారు. కేంద్రం అంగీకరించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని పేర్కొన్నారు. మండల్ కమిషన్ సిఫారసులను పూర్తిగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కులగణన ప్రకటన పట్ల బీసీటీఏ హర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES