మున్సిపల్ కమిషనర్ కొడారి సుష్మ
నవతెలంగాణ – పరకాల: సైబర్ నేరస్థులు చేసే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల మున్సిపల్ కమిషనర్ కొడారి సుష్మ సూచించారు. పరకాల పురపాలక సంఘం నుండి ఆన్లైన్ చెల్లింపుల కోసం ట్రేడ్ లైసెన్స్ పొందేందుకు, వ్యాపార లైసెన్సుల కోసం, ఇంటి పన్ను, ఇతరత్ర ఎలాంటి బకాయిల కోసం మున్సిపల్ అధికారుల నుండి ఫోన్ కాల్స్ చేయడం జరగదన్నారు. వ్యాపారస్తులు, గృహ యజమానులు అప్రమత్తంగా ఉండి మున్సిపల్ అధికారుల పేరుతో ట్రైన్ లైసెన్సు, మున్సిపల్ బకాయిలు చెల్లించాలని వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపల్ శాఖ పేరుతో వచ్చే నకిలీ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసు అధికారులను గాని, మున్సిపల్ అధికారులు కానీ సంప్రదించాలని తెలిపారు.
సైబర్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES