జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
నవతెలంగాణ-రామారెడ్డి
పరీక్షల్లో విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాసి, మంచి ప్రతిభను కనబరచాలని విద్యార్థుల ఉద్దేశించి జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలను అందజేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు మధ్యాహ్న భోజన చార్జీలను పెంచి, నాణ్యమైన భోజనాన్ని అందిస్తుందని, మధ్యాహ్న భోజన నిర్వహకులకు ఆర్థిక ఇబ్బందులను తగ్గించిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సర్పంచ్ చాకలి లతా శ్రీనివాస్, ఉప సర్పంచ్ దయానంద్, మాజీ సొసైటీ చైర్మన్ స్వామి గౌడ్, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సాగర్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రగోతం రెడ్డి, చిన్న గంగారెడ్డి, పంగా రాజ్యం, ఎల్లం, కీసరి లక్ష్మణ్, కూడెల్లి స్వామి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



