- Advertisement -
నవతెలంగాణ-బజార్ హాత్నూర్ : రైతులు తమ పశువులకు సోకే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల పశువైద్యాధికారి పర్వీజ్ అహ్మద్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పశువైద్యాశాలలో ఉచిత లంపి స్కిన్ (ముద్ద చర్మ వ్యాధి) నివారణ టీకాల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముద్దపు చర్మవ్యాధి సోకితే పాడి రైతుకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని, పాల దిగుబడి గణనీయంగా తగ్గి రైతుకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగులుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -