- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
విద్యార్థులు సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కురుమూర్తి అన్నారు. శనివారం మండల పరిధిలోని గుండాల ఏకలవ్య కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. అపరిచితులు పంపించే లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. మొబైల్ వాడకం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా తమ ఇండ్లలో తల్లిదండ్రులకు సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉంచేందుకు జాగ్రత్తలు , తీసుకునేలా సూచనలు సలహాలు ఇవ్వలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -