- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13,500 కోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీని భారత్కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు ఆమోదం తెలిపింది. ఆంట్వెర్ప్లోని కోర్టు చోక్సీ అరెస్టును సమర్థించడమే కాక, భారత్కు అప్పగించేందుకు అనుమతినిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్లో బెల్జియం పోలీసులు చోక్సీని అరెస్ట్ చేశారు. అయితే, చోక్సీకి పై కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఇది భారత్కు ఒక కీలక ముందడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
- Advertisement -