Tuesday, June 24, 2025
E-PAPER
Homeఖమ్మంప్రభుత్వ బడుల్లో నే మెరుగైన విద్య: హెచ్ ఎం హరిత 

ప్రభుత్వ బడుల్లో నే మెరుగైన విద్య: హెచ్ ఎం హరిత 

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వ బడుల్లో నే నైపుణ్యాలు సాధించే మెరుగైన విద్య అందుతుందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత అన్నారు. అశ్వారావుపేట కాంప్లెక్సు పరిధిలోని వివిధ పాఠశాలల్లో బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గ్రామసభలు నిర్వహించారు.నెహ్రూ నగర్ ప్రాధమిక పాఠశాలలో హెచ్ఎం బేబీ పద్మ అధ్యక్షతన జరిగిన గ్రామ సభకు ముఖ్య అతిధి గా విచ్చేసిన కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయురాలు హరిత మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా సకల సౌకర్యాలతో బలోపేతం చేసిందని అత్యంత ఖరీదైన డిజిటల్ విద్యాబోధన జరుగుతుందని,సుశిక్షితులైన ఉపాధ్యాయులచే ఆంగ్ల,తెలుగు మాధ్యమాలలో బోధన,మధ్యాహ్న భోజనం ఉచిత పాఠ్యపుస్తకాలు,రాగి జావ, కంప్యూటర్ విద్య వంటి అవకాశాలు కల్పిస్తుందని ప్రతి తరగతి గదిలో విద్యార్ధులకు అనువైన సౌకర్యాలు కల్పించిందని డబ్బులు వెచ్చించి ప్రయివేటు పాఠశాలలకు పంపవద్దని  డబ్బులు ఉన్నత చదువులకు వినియోగించు కోవచ్చు నని తల్లిదండ్రులకు గ్రామసభ సబ్యులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్ధులు ఉన్నత అవకాశాలను అంది పుచ్చు కుంటున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు యామిని,జ్యోతి, అమ్మ ఆదర్శ పాఠశాల వి.ఒ కనక మహాలక్ష్మి,అంగన్వాడీ టీచర్లు,మహిళా సమాఖ్య సభ్యులు,జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు,ఐ.ఇ.ఆర్.పి రామారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -