Friday, June 6, 2025
E-PAPER
Homeఖమ్మంవిలువ ఆధారిత ఉత్పత్తులతోనే రైతుకు మెరుగైన ధరలు

విలువ ఆధారిత ఉత్పత్తులతోనే రైతుకు మెరుగైన ధరలు

- Advertisement -

– శాస్త్రవేత్త క్రిష్ణ తేజ్
నవతెలంగాణ – అశ్వారావుపేట
: విలువాధిరిత వ్యవసాయ ఉత్పత్తులతోనే రైతు తన పంటకు తానే ధర నిర్ణయించుకునే సాధికారత లభిస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్త క్రిష్ణ తేజ్ అన్నారు. శాస్త్రవేత్తలను రైతు ముంగిట్లో ప్రవేశపెట్టిన ప్రొఫెసర్స్ జయశంకర్ తెలంగాణ  వ్యవసాయ విశ్వ విద్యాలయం వారి “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం గురువారం అశ్వారావుపేట మండలం బచ్చు వారి గూడెంలో దిగ్విజయం గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక వ్యవసాయ కళాశాల అధ్యాపకులు అయిన శాస్త్రవేత్తలు మధుసూదన్ రెడ్డి,పావని,కృష్ణ తేజ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భం వారు మాట్లాడుతూ రైతు దగ్గరకే తాము వచ్చి వారి సమస్యలను,అభిప్రాయాలను తెలుసుకోవడం చాలా హర్షణీయం అని అన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం లోని 6 ముఖ్యాంశాలను శాస్త్రవేత్తలు,అధికారులు రైతులకి తెలియచేసారు. రైతు తన పంటకు తానే ధర నిర్ణయించాలి అంటే ఒక్క వ్యవసాయం మీదనే ఆధారపడితే చాలదని,విలువ ఆధారిత ఉత్పత్తులను కూడా తాయారు చేయాలని డాక్టర్  కృష్ణ తేజ్ అభిప్రాయపడ్డారు.పొలం లో ఉన్న ప్రతి కీటకం మనకి హాని కలిగించేది  కాదని మిత్ర పురుగులు కూడా ఉంటాయని కాబట్టి రైతులు రసాయనాలు పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని డాక్టర్ టి.పావని తెలియచేసారు. రైతులు తెలిసో తెలియకో మోతాదు కి మించి యూరియా వాడడం వల్ల నేల తల్లి కి సుస్తీ చెయ్యడమే కాకుండా ఆ పంటల ఉత్పత్తులను తిన్న మనుషులకి కూడా క్యాన్సర్ లాంటి మహమ్మారి వస్తుందని తెలియజేసారు.  వ్యవసాయంలో లోటుపాట్లు ఎప్పుడు ఉంటాయని, రైతులతో కలిసి పనిచేసి వాటిని అధిగమించడం మే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని వ్యవసాయ కళాశాల రైతులకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ రైతాంగానికి సేవ చేస్తూనే ఉంటుందని, వీలు చూసుకొని కళాశాలను దర్శించాలని రైతులకి తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మండల అధికారి శివ ప్రసాద్,ఉద్యాన శాఖ మండల అధికారి వేణు మాధవ్,వ్యవసాయ విస్తరణాధికారులు రవీందర్, సతీష్,షకీరా భాను, పంచాయతీ సెక్రటరీ మెహరాజ్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -