- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సిర్పూర్ కాగజ్నగర్-సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ రైల్వే స్టేషన్ వద్ద నిలిచిపోయింది. ఎంతకూ రైలు కదలకపోవడం, అధికారులూ స్పందించకపోవడంతో ప్రయాణికులు బస్సుల కోసం రాజీవ్ రహదారిపైకి చేరుకున్నారు. బస్సుల కోసం వదలాది మంది ప్రయాణికులు వేచిఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఉదయం 3.35 గంటలకు సిర్పూర్ కాగజ్నగర్ నుంచి బయలుదేరిన ఈ రైలు 10.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవాలి.
- Advertisement -