వివిధ సమస్యలపై 468 దరఖాస్తుల స్వీకరణ
నవతెలంగాణ – మల్హర్ రావు : మండల కేంద్రమైన తాడిచెర్లలో మండల తహసిల్దార్ రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వివిధ సమస్యలపై మొత్తం 468 దరఖాస్తులు వచ్చినట్లుగా తహశీల్దార్ తెలిపారు. టీమ్-1తహశీల్దార్ ఆధ్వర్యంలో తాడిచెర్ల రైతువేదికలో నిర్వహించిన సహాయక కేంద్రంలో 268 దరఖాస్తులు, టీమ్-2 డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దోమలమాదరంలో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రంలో 200 దరఖాస్తులు వచ్చాయి. అయితే మొత్తం 468 వివిధ భూ సమస్యలసై వచ్చాయన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితులుగా మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు, మాజీ జెడ్పిటిసి అయిత కోమల రాజిరెడ్డి హాజరై మాట్లాడారు. గతంలో ఉన్న ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని, సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం గుర్తించి ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు మేధావులు, రైతు సంఘాలు, అందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ కొత్త చట్టం తీసుకు వచ్చిందన్నారు. లోపభూయిష్టంగా ఉన్న ధరణి వల్ల పట్టాల జారీలో ఏదేని పొరపాటు జరిగితే అప్పీలు చేయడానికి ఆవకాశం లేదని, రైతులు సివిల్ కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేదని అన్నారు. దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో భూ భారతి తెస్తామని చెప్పిన ప్రకారం పటిష్టమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. భూములు కొన్నా, అమ్మినా లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా హద్దులతో మ్యాపు తయారు చేసి పట్టాదారు పాసు పుస్తకాల్లో నమోదు చేస్తారని వివరించారు. తద్వారా భూమి గుర్తింపుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. ఏదేని సందర్భంలో తహసీల్దార్ ద్వారా పొరపాటు జరిగితే ఆర్డిఓ, ఆర్డిఓ నుండి కలెక్టర్, కలెక్టర్ నుండి భూ ట్రిబ్యునల్ కు వెళ్ళడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఉచిత న్యాయ సహాయ సేవలు అందించడానికి అవకాశం కల్పించారని అన్నారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
తాడిచెర్లలో భూ భారతి అవగాహన సదస్సు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES