Thursday, November 6, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్ ఎన్నిక‌లు: మ‌ధ్యాహ్నం పోలింగ్ శాతం ఎంతంటే?

బీహార్ ఎన్నిక‌లు: మ‌ధ్యాహ్నం పోలింగ్ శాతం ఎంతంటే?

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్ తొలి విడ‌త పోలింగ్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. మొదటి దశ ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా, మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌ వ‌ర‌కు 42.31% శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు క్యూలైన్‌లో నిల‌బ‌డి త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల‌కు రెండు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. తొలి ద‌శ‌లో 121 స్థానాల‌కు పోలింగ్ జ‌రుగుతోంది. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల‌కు 11న పోలింగ్ నిర్వ‌హించనున్నారు. మొదటి దశ ఎన్నికల్లో భాగంగా గ్రామీణ పీఎస్ లతో సహా మొత్తం 45,341 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -