Friday, December 12, 2025
E-PAPER
Homeబీజినెస్బిలియన్‌ డాలర్లతో క్లౌడ్‌ డేటా సెంటర్‌ విస్తరణ

బిలియన్‌ డాలర్లతో క్లౌడ్‌ డేటా సెంటర్‌ విస్తరణ

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వంతో అమెజాన్‌ ఒప్పందం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తమ క్లౌడ్‌ డేటా సెంటర్‌ మౌలిక సదుపాయలను విస్తరించేందుకు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) 7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వ్యూహాత్మక ఫ్రేమ్‌ వర్క్‌ ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం, అమెజాన్‌ సంతకాలు చేశాయి. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2025 నిర్వహణతో తర్వాత, రాబోయే 14 ఏండ్లలో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్టు అమెజాన్‌ వెల్లడించింది. అమెజాన్‌ తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఏడబ్ల్యూఎస్‌ ఇండియా, సౌత్‌ ఆసియా అధ్యక్షులు సందీప్‌ దత్తా మాట్లాడుతూ ఈ పెట్టుబడులతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనీ, స్థానికంగా వ్యాపారం పెరిగి ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.స్టాల్ట్‌ నీల్సన్‌ హైదరాబాద్‌లోని తన సెంటర్‌ ను ఉత్పత్తుల అభివృద్ధికి, డిజిటల్‌ ఆవిష్కరణలు తదితర వాటికి గ్లోబల్‌ హబ్‌ మార్చేందుకు ముందుకొచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -