- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని, అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని మద్నూర్ మండల రెడ్ క్రాస్ అధ్యక్షులు ప్రకాష్ తెలిపారు. ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా శనివారం మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల చైర్మన్ ప్రకాష్, వైస్ చైర్మన్ పండరి నాథ్ ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -