- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామంలో నీలి నాలుక నివారణ టీకాలను (బ్లూ టంగ్) చందుపట్ల లైవ్ స్టాక్ అసిస్టెంట్ నరసింహా యాదవ్ గొర్రెలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న నీలి నాలుక నివారణ టీకాలను గొర్రెల కాపరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ చైర్మన్ చిన్నం బాలేశ్వర్, గొర్ల కాపర్లు చంద్రమౌళి, గొర్రెల మేకల పెంపకం దారులు, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -