- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నైజీరియాలోని నైజర్ రాష్ట్రంలోని పడవ బోల్తా పడి 31 మంది మరణించారు. 50 మందిని కాపాడినట్లు ఆ దేశ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ అధికారి హుస్సేని ఇసా తెలిపారు. ప్రమాద సమయంలో పడవలో 90 మంది ఉన్నట్లు చెప్పారు. సామర్ధ్యానికి మించి ప్రయాణికులతో పడవ వెళ్లడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన నదిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
- Advertisement -