- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి : మండలంలోని గోకుల్ తాండకు చెందిన మాలో భాస్కర్ అనారోగ్యంతో దుబాయ్ లో మృతి చెందారు. ఆయన పార్థీవ దేహం ఆదివారం స్వగ్రామానికి చేరుకుంది. శవాన్ని చూసిన కుటుంబ సభ్యులు, తాండవాసులు కన్నీరు మున్నీరయ్యారు. శవం స్వగ్రామానికి చేరడానికి కృషి చేసిన జి డబ్లు ఏసి దుబాయ్ అధ్యక్షులు నరేందర్ కు, రామారెడ్డి మండల జి డబ్ల్యు ఏసి అధ్యక్షులు బండ సురేందర్ రెడ్డికి బాదిత కుటుంబీకులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -