- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : శంషాబాద్లో మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి. కువైట్-శంషాబాద్ (KU-373) విమానంతో పాటు బ్రిటీష్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మెయిల్స్ అందుకున్న వెంటనే, కువైట్-శంషాబాద్ విమానాన్ని మస్కట్కు దారి మళ్లించారు. లండన్-శంషాబాద్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టింది.
- Advertisement -


