గాజా: ఇజ్రాయిల్ మారణకాండకు అమాయక పాలస్తీయన్లు బలవుతూనే ఉన్నారు. వందల సంఖ్యలో జనం ప్రాణాలు తీసేలా బాంబుల వర్షం కురిపిస్తూనే ఇన్నది. తాజాగా ఆహార సంక్షోభంలో ఉన్న పాలస్తీయన్లపై వైమానిక దళాలు దాడి చేశాయి. రఫాలో అమెరికా సాయంతో గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (జీహెచ్ఎఫ్) నడుపుతున్న సహాయ సామగ్రి పంపిణీ కేంద్రంపై ఇజ్రాయిల్ సైన్యం దాడి చేసింది. ఈ ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనా, హమాస్ అనుబంధ మీడియా ఆదివారం తెలిపింది. అయితే ఈ దాడిపై ఇజ్రాయిల్ ఇంకా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. బాధితులకు సహాయ సామగ్రిని అందజేసేందుకు జీహెచ్ఎఫ్ ఇటీవలే గాజాలో కార్యకలాపాలు ప్రారంభించింది. అమెరికాతో పాటు ఇజ్రాయిల్ కూడా దీనికి మద్దతు ఇస్తోంది. కాగా బయోమెట్రిక్ తనిఖీలు, ఇతర స్క్రీనింగ్ ప్రక్రియల కారణంగా జీహెచ్ఎఫ్ తటస్థ వైఖరిపై కొందరు పాలస్తీనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే హమాస్తో సంబంధం ఉన్న వారిని సహాయ కేంద్రాలకు దూరంగా ఉంచేందుకే తాము ఈ చర్యలు చేపట్టామని ఇజ్రాయిల్ చెబుతోంది. జీహెచ్ఎఫ్కు చెందిన ఓ పంపిణీ కేంద్రం సమీపంలో ఇజ్రాయిల్ సైన్యం ముగ్గురు పాలస్తీనియన్లను చంపిందని, 46 మందిని గాయపరచిందని హమాస్ గత నెల 28న ఆరోపించింది. అయితే జీహెచ్ఎఫ్ ఈ ఆరోపణను తోసిపుచ్చింది. అప్పటి నుండి వేలాది మంది పాలస్తీనియన్లు సహాయ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.
సాయం కోసం బారులుదీరిన జనంపై బాంబుల వర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES