- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణలో భక్తిప్రపత్తులతో నిర్వహించుకునే బోనాల పండుగను శనివారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే వెనుకబడిన తరగతుల బాలికల గురుకులం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. మూడో శనివారం నిర్వహించే టీ విత్ ప్రిన్సిపాల్ లో భాగంగా ప్రిన్సిపాల్ నిరోషా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి పలు అంశాలు పై మాట్లాడారు.అనంతరం విద్యార్ధులు,బోధనా సిబ్బంది బోనాలు నెత్తిన పెట్టుకుని సంబరాలు చేసుకున్నారు.
- Advertisement -