- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలం కల్లడి గ్రామ పరిధిలో గురువారం తెల్లవారుజామున బ్రేక్ ఫెయిల్ కారణంగా కారు చెరువులోకి దూసుకెళ్లిన ఘటన జరిగింది. బోర్గం గ్రామానికి చెందిన రాజారాం శ్రీనివాస్ (54), కల్లడి నుండి బోర్గం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉదయం సుమారు 4 గంటల సమయంలో కారు నియంత్రణ కోల్పోవడంతో నేరుగా చెరువులోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ శ్రీనివాస్ గాయపడకుండా సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
- Advertisement -