- Advertisement -
నవతెలంగాణ-మోపాల్: మండలంలోని కులాస్పూర్ గ్రామంలో గల అంగన్వాడి సెంటర్లో సోమవారం ఉయ్యాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ జనార్దన్ రెడ్డి,సూపర్వైజర్ హాజరైయ్యారు. చిన్నపిల్లలకి తల్లిపాలే పట్టాలని డబ్బా పాలకు దూరంగా ఉంచాలని, బాలింత తల్లులు కూడా మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రజిత,సుమలత,విజయ,సరోజా,సుజాత,సాయి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



