Wednesday, June 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమిస్‌వరల్డ్‌ కంటెస్ట్‌ల పర్యటనపై బీఆర్‌ఎస్‌ వివాదం సరిగాదు

మిస్‌వరల్డ్‌ కంటెస్ట్‌ల పర్యటనపై బీఆర్‌ఎస్‌ వివాదం సరిగాదు

- Advertisement -

– తెలంగాణ ప్రతిష్టను దిగజార్చొద్దు : మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ములుగు, రామప్ప దేవాల యాల పర్యటనను బీఆర్‌ఎస్‌ నేతలు వివాదా స్పదం చేయడాన్ని మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ (సీతక్క) తప్పుబట్టారు. స్వార్థ రాజకీ యాల కోసం ప్రతి అంశాన్నీ వక్రీకరిం చడం టీఆర్‌ఎస్‌కు పరిపాటిగా మారిం దంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం హైదరా బాద్‌లో ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. వరంగల్‌ వేయి స్తంభాల గుడి, రామప్ప గుడి వద్ద హెరిటేజ్‌ వాక్‌ పర్యటన ఏర్పాట్లు చేసిన ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. హెరిటేజ్‌ వాక్‌ సక్సస్‌ కావడంతో బీఆర్‌ఎస్‌ నేతలు కండ్లలో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు. ఇవాంక ట్రంప్‌ వచ్చినప్పుడు తోకపట్టుకుని తిరిగిన నాయకుడు ఎలాంటి సంస్కృతి సంప్రదాయాలు పాటించారో అందరికీ తెలుసని పేర్కొన్నారు. గిరిజన సంప్రదాయంలో గుళ్లలోకి కాళ్ళు కడుగుకొని వెళ్ళడం సంప్రదాయమనీ, అదే అక్కడ పాటించారని తెలిపారు. అందులో కార్యక్రమ నిర్వాహకుల్లో ఒక అమ్మాయి మిస్‌వరల్డ్‌ కంటెస్ట్‌ల కాళ్లకు నీళ్లు పోసిందని పేర్కొన్నారు. దాన్ని పట్టుకొని తెలంగాణ ప్రభుత్వం చేసిందని విషప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు. బీఆర్‌ఎస్‌ నేతలు సిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కవితమ్మ కాళ్ళ దగ్గర కలెక్టర్‌ను కూర్చోబెట్టడం, కేసీఆర్‌ కలెక్టర్లతో కాళ్ళు మొక్కించుకోవడం దురహంకారం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ పేరును పార్టీ నుంచి తీసేసిన బీఆర్‌ఎస్‌ నేతలకు తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే హక్కు లేదని పేర్కొన్నారు. సబితాఇంద్రారెడ్డి వాస్తవాలు మాట్లాడాలనీ, అబద్ధాలకు అంబాసిడర్‌గా మారొద్దని సూచించారు. అధికారం పోయాక ప్రజలు, ఆత్మగౌరవం మీకు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -