నవతెలంగాణ – తాడ్వాయి : బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గత కొంతకాలం నుండి హెర్నియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి పొందుతున్న జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబును తన సొంత గృహం హైదరాబాదులో వారిని బుధవారం బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ జాజ చంద్రం, దామర్వాయి మాజీ సర్పంచ్ నూశెట్టి సరితరమేశ్ లు బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి వచ్చి పరామర్శించారు. వారి బాగోగులు ఆరోగ్య సంబంధించిన తదితర విషయాలను చర్చించారు. సమయానికి మందులు వేసుకోవాలని సూచించారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి వెంట పార్టీ సీనియర్ నాయకులు గాదె సురేష్, చల్వాయి రవీందర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
బీఆర్ఎస్ కాకులమర్రి లక్ష్మణ్ బాబుకు పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES