నవతెలంగాణ-పెద్దవూర
విద్యుత్ ఘాతంతో కోడెద్దు మృతి చెందిన సంఘటన పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామం లో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం బట్టుగూడెం గ్రామానికి చెందిన చెన్ను సైదిరెడ్డి ఆవులు మేత మేయడానికి పొలానికి వెళ్లగా అందులోని ఒక కోడె కంచె లేని ట్రాన్స్ఫార్మర్ దగ్గరలో మేస్తుండగా విద్యుత్ వైరు కోడెకు తగలడంతో విద్యుత్ ఘాతంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఎద్దు మృతిని తెలుసుకున్న బాధితుడు,కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించాడు. మృతి చెందిన ఎద్దు విలువ 80,000 రూపాయలు విలువ వుంటుందని తెలిపాడు. ప్రభుత్వం అదుకోవాలని రైతు కోరాడు. కాగా, కంచె లేని ట్రాన్ఫార్మర్ వద్ద బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES