- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రియాద్ ఎంబసీ, జెడ్డా కాన్సులేట్ అవసరమైన సహాయం అందిస్తున్నాయని తెలిపారు. “భారత రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నాం. వారు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు” అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
- Advertisement -



