నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. వివిధ రకాల బస్పాస్ల ధరలను గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన ఛార్జీలు సోమవారం (జూన్ 9) నుంచే అమల్లోకి వచ్చాయి. సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులు వినియోగించే పాస్ల ధరలు కూడా పెరిగాయి. సగటున 20 శాతానికి పైగా ఈ పెంపుదల ఉంది.
వివిధ పాస్ల పాత, కొత్త ధరలు
– సాధారణ ప్రయాణికులు ఎక్కువగా వాడే ఆర్డినరీ బస్పాస్ ధర ఇప్పటి వరకు రూ. 1,150 ఉండగా, దీన్ని రూ. 1,400 కు పెంచారు.
– మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధర రూ. 1,300 నుంచి రూ.1,600 కు పెంచారు.
– మెట్రో డీలక్స్ పాస్ ధర రూ. 1,450 నుంచి రూ. 1,800కు పెరిగింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వినియోగించే ఇతర పాస్లు, గ్రీన్ మెట్రో ఏసీ బస్పాస్ ధరలను కూడా టీజీఆర్టీసీ సవరించింది. ఈ ఆకస్మిక పెంపుదల నెలవారీ పాస్లపై ఆధారపడే వేలాది మంది ప్రయాణికులపై అదనపు భారం మోపనుంది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులపై ప్రభావం పడనుంది.
తెలంగాణలో భారీగా పెరిగిన బస్ పాస్ ధరలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES