– 15 రోజులకోసారి నిర్వహణ
– మొదటి, మూడో శనివారం మంత్రివర్గం : సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇక నుంచి ప్రతినెలా రెండుసార్లు మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలను నిర్వహిస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతినెలా మొదటి, మూడో శనివారం మంత్రివర్గ సమావేశాలు జరుగుతాయని వివరించారు. విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం లేకుండా వేగం పెంచాలనీ, అందుకే రెండు, మూడు నెలలకోసారి కాకుండా నెలకు రెండు సార్లు నిర్వహిస్తామని వివరించారు. క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు వీలుగా రెండు వారాలకోసారి మంత్రివర్గ సమావేశం ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 17 సార్లు మంత్రివర్గ సమావేశాలు జరిగాయని తెలిపారు. గురువారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే.
ఇక నెలకు రెండుసార్లు క్యాబినెట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES