Thursday, October 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలురేపు భారత్ బంద్ కు పిలుపు..

రేపు భారత్ బంద్ కు పిలుపు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్‌’ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపునిస్తూ మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా ఈ నెల 23 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మావోయిస్టు పార్టీ ఆ లేఖలో పేర్కొంది. ఈ ఆపరేషన్‌ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.. భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -