నవతెలంగాణ-హైదరాబాద్: వివాదాల దర్శకుడు రాంగోపాల్పై మరో కేసు నమోదయింది. రిటైర్డ్ ఐపీఎస్ అంజనా సిన్హా (Anjana Sinha) ఫిర్యాదుతో ఆయనపై రాయదుర్గం పోలీసులు కేసు ఫైల్చేశారు. 2022లో ‘దహనం’ అనే వెబ్సిరీస్ను ఆర్జీవీ (RGV) నిర్మాతగా తెరకెక్కించారు. అదేఏడాది ఏప్రిల్ 14న ఆ సినిమా విడుదలైంది. ఈ సినిమాను రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చెప్పిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించినట్లు ఆర్జీవీ వెల్లడించారు.
అయితే అదంతా నిజం కాదని, తాను ఎవరితోనూ వాస్తవ ఘటనలంటూ చెప్పలేదని పేర్కొంటూ అంజనా సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత గుర్తింపును దుర్వినియోగం చేశారని అందులో పేర్కొన్నారు. అనుమతి లేకుండా తన పేరును ఉపయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.