- Advertisement -
– తాత్కాలిక మెట్లు ఎక్కలేక లేక జారీపడిన వృద్ధుడు..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మండల కేంద్రంలో గల సిసి బ్యాంక్ మెట్లు తొలగించబడ్డాయి. శాశ్వత మెట్లు ఏర్పాటు చేయలేక తాత్కాలికంగా ఇసుక సంచులు ఏర్పాటు చేశారు. మంగళవారం ఖాతాదారుడు పోతుల మల్లయ్య బ్యాంక్ పైకి ఎక్కుతుండగా ఇసుక సంచులు జారడంతో మల్లయ్య కాలుజారి కింద పడిపోయాడు. మల్లయ్యకు గాయాలు కావడంతో బ్యాంక్ అధికారులను మెట్లు ఏర్పాటు చేయాలని మల్లయ్య ప్రశ్నించాడు. ఉన్నతాధికారులకు మెట్లు ఏర్పాటు చేయవలసిందిగా బ్యాంకు నుండి ప్రతిపాదనలు పంపినట్లు బ్యాంక్ అధికారులు పర్కొన్నారు.
- Advertisement -