నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండలంలోని ముదెల్లి గ్రామంలోని శ్రీరామ కాలనీలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుల పనులను స్థానిక నాయకులతో కలసి మాజీ సర్పంచ్ మండల కాంగ్రెస్ స్పోక్స్పర్సన్ కాగుల మోహన్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ యాదవ్ మాట్లాడుతూ..ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కాలనీలో రోడ్లు, మురికినీటి కాలువలు, విద్యుత్ సరఫరా లభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కాలనీవాసులు ఎమ్మెల్యే మదన్ మోహన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రోల సాయిలు, పెద్దకాపు దేశాని సాయిలు, వడ్డే రాజు, నారాయణ రావు, రమేష్ యాదవ్, చిన్న రాజు, కిరణ్ గౌడ్, పల్లె కాశీరాం, చాకలి బాలయ్య, గులాం అలీ, వడ్నాల లక్ష్మయ్య, మంగమ్మగారి శ్రీనివాసరావు, బల్గురి రాజు, మొగులాకర్ రావు, సురేందర్, టేకుమల్లి రవి, వడ్నాల నరసింహులు, మొండి సడక్ గ్రామ అధ్యక్షులు మహబూబ్ సాబ్, డాక్టర్ చందు వినోద్ రాథోడ్, మండల వర్కింగ్ యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్, వెంకటాపూర్ గ్రామ అధ్యక్షులు దేవి సింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
ముదెల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES