Friday, December 12, 2025
E-PAPER
Homeజాతీయంతమిళనాడులో మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష

తమిళనాడులో మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష

- Advertisement -

వ్యతిరేకంగా సీపీఐ(ఎం) భారీ ర్యాలీ
కోయంబత్తూరు :
తమిళనాడులోని మెట్రో ప్రాజెక్టులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష ప్రదర్శించడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు లౌకిక ప్రగతిశీల కూటమి పార్టీలతో కలిసి సీపీఐ(ఎం) కోయంబత్తూరులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం తమిళనాడు అభివృద్ధి ప్రయోజనాలకు ద్రోహం చేసిందని ఈ ర్యాలీలో పాల్గొన్న నాయకు లు విమర్శించారు. సీపీఐ(ఎం) కోయంబత్తూరు జిల్లా కార్యదర్శి సి.పద్మనాభన్‌ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు, మధురైలకు ప్రతిపాదిత మెట్రో ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఇటీవల తిరస్కరిం చింది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, కాన్పూర్‌ వంటి చిన్న నగరాలకు కూడా మెట్రో రైలు ప్రాజెక్టులకు మోడీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -