నవతెలంగాణ – తంగళ్ళపల్లి
సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఫై జరిగిన దాడికి ఇప్పటికి కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సావనపల్లి బాలయ్య కోరారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నవంబర్ 1న హైదరాబాద్ లో దళితులు చేపట్టిన దళితుల ఆత్మగౌరవం నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని విజయం చేయాలని కోరారు.సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ స్థానంలో ఉన్న దళితుడికే రక్షణ లేకపోతే దేశంలో సామాన్య దళితులకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నినించారు.
 దళితుల ఆత్మ గౌరవం, ఆస్థిత్వాన్ని కాపాడుకోవడం చేపట్టే ర్యాలీ కి పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని దళితుల సత్తా చాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ సావనపెల్లి రాకేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు చదల రాకేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు ఎడ్ల రవి, తుడుం నర్సయ్య,చదురుమల్ల మల్లయ్య,ఎడ్ల అరుణ్ కుమార్,మునిగే దేవరాజు,మల్లారపు నరేష్,అక్కనపెల్లి పోచమల్లు,చదల రాజశేఖర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

 
                                    