Saturday, December 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే, విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12805/12806) రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చేసింది. ఈ కొత్త వేళలు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయి. విశాఖపట్నం-లింగంపల్లి (12806) రైలు ఉదయం 6.20కి బయల్దేరి రాత్రి 7.15కి లింగంపల్లి చేరుకుంటుంది. లింగంపల్లి-విశాఖపట్నం (12805) రైలు ఉదయం 6.55కి బయల్దేరి రాత్రి 7.50కి విశాఖపట్నం చేరుకుంటుంది. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో కొన్ని వీక్లీ రైళ్లను మరికొన్ని వారాలు పొడిగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -