- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి జిల్లా కేంద్రంలోని హనుమాన్ వాడ కి చెందిన మాజీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయ చైర్మన్ కుక్కదువు కృష్ణ తల్లి కుక్కదువు గౌరమ్మ దశదిన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి సానుభూతిని తెలిపారు. గౌరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కుక్కదువు సోమయ్య, నరముల శ్రీనివాస్ యాదవ్,మేడబోయిన రాజు, బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు కుతాడి సురేష్, కుక్కదువు శ్రీనివాస్, కుక్కదువు సునీల్,మోతే మనోహర్, యాట గణేష్ లు పాల్గొన్నారు.
- Advertisement -