- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: థాయ్లాండ్లో పార్లమెంట్ను రద్దుచేస్తూ ఆ దేశ ప్రధాని అనుతిన్ చార్న్విరకూల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజు మహా వజీరాలాంగ్కార్న్ అనుమతితో పార్లమెంట్ను రద్దు చేశారు. అనంతరం ఎన్నికలకు వెళ్లనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కంబోడియాతో ఘర్షణల నేపథ్యంలో ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అక్కడి నియమాల ప్రకారం పార్లమెంట్ రద్దు అనంతరం 45 నుంచి 60 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలి.
- Advertisement -



