Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వర్షాకాలం శుభ్రతే మంత్రం 

వర్షాకాలం శుభ్రతే మంత్రం 

- Advertisement -

– ఈగలు దోమలతో పొంచి ఉన్న ప్రమాదం
– ముందస్తు చర్యలు పాటిస్తే మేలంటున్న వైద్య నిపుణులు 
 నవతెలంగాణ – కాటారం
:  కురుస్తున్న వర్షాలతో దోమలు ఈగలు ప్రభల్లే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం గ్రామాల్లో వర్షపునీరు నిలిచి అపరిశుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో భయంకరమైన సీజనల్ వ్యాధులు సంభవించే ఆస్కారం ఉంది. గ్రామాలు, పట్టణాల్లో మురుగు, వర్షం నీరు ఎక్కడ నిల్వ ఉంచకుండా చూసుకోవలసిన అవసరం ఉంది.చూసుకోకుంటే రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఈగలు చిన్నవైనా అవి ఎన్నో వ్యాధులకు కారణమవుతున్నాయి. ఈగకు కుట్టే కులం లేకున్నా మెడికల్ ట్రాన్స్ఫర్ విధానం వల్ల రోగాలను చేర్చి పెంచుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 దోమ కాటుతో డెంగ్యూ, చికెన్ గున్యా,మెదడువాపు వ్యాధులతో వస్తున్న రోగాల సంఖ్య కంటే వర్షాకాలంలో కామెర్లు,కలరా,టైఫాయిడ్ వంటి వ్యాధులు బారిన పడే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. దోమకాటుకు గురైన రోగికి వ్యాక్సిన్ ద్వారా నయం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈగలతో వచ్చే వ్యాధుల నుంచి ప్రజలను కాపాడే పరిస్థితి వైద్యులకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. అని పలువురు పేర్కొన్నారు. ప్రధానంగా అపరిశుభ్రమైన ప్రాంతాల్లో ఈగలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి.గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ యేసే చెత్తాచెదారంతో పాటు మాంసం చికెన్ విక్రయ కేంద్రాల మురుగు కారణాలు మొదలగు ప్రాంతాల్లో ఈగలు తన సంతతిని పెంచుకొని ఇళ్లల్లో ప్రవేశిస్తాయి.   టైఫాయిడ్ ఎక్కువగా రోజులపాటు జ్వరం నీళ్ల విరోచనాలు సీమ బంక విరేచనాలతో శరీరంలో ఉండే నీటి శాతం తగ్గి డిహైడ్రేషన్ రావడం జరుగుతుంది. పచ్చకామెర్ లు కాలేయానికి వాపు రావడం కనులు పసుపు పచ్చగా మారడం ఆకలి మందగించడం నీరసంగా ఉండటాన్ని కామెర్లుగా గుర్తించాలి.


  పరిశుభ్రత చాలా ముఖ్యం :  డాక్టర్ మౌనిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాటారం
 వర్షాకాలంలో పరిశుభ్రతతోనే వ్యాధులకు దూరంగా ఉండవచ్చు నివాసాలు పరిసరాల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకొని తినుబండరాలపై ఈగలు దోమలు వాడకుండా చూసుకోవాలి అని తినాలి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad