- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మండలంలోని అంతంపల్లి గ్రామంలోని అంగన్వాడీ పాఠశాల పరిసరాల్లో శుభ్రత కార్యక్రమం చేపట్టారు. పాఠశాల పరిసరాలను శుభ్రపరచి పరిశుభ్ర వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకున్నారు. గ్రామ పరిశుభ్రతను కాపాడాలని సర్పంచ్ మంజుల సంజీవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భార్గవి, వార్డ్ మెంబర్లు, పంచాయతి సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



