నవతెలంగాణ – పెద్దవూర
ప్రభుత్వ విద్యాసంస్థల మూసివేతను అపాలి అని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ అన్నారు. సోమవారం భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ పెద్దవూర మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. అటు గురుకుల జూనియర్ కళాశాలలను, ప్రభుత్వ పాఠశాలను విద్యార్థులు లేరని సాగుతూ మూసి వేయడాన్ని ఆపాలన్నారు. నల్గొండ జిల్లాలో 298 ప్రభుత్వ పాఠశాలను జీరో ఎన్రోల్మెంట్ పేరుతో మూసివేయాలని చూడడం సరికాదన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులు ఈ నిర్ణయం వల్ల చదువుకు దూరం అవుతారని, కావున ప్రభుత్వం ప్రభుత్వ విద్య సంస్థల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని తెలిపారు. ప్రభుత్వ విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించి బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో డి వై ఎఫ్ ఐ మండల కార్యదర్శి తరి రామక్రిష్ణ, కారింగు ప్రవీణ్, పెద్దగోని కోటి,పెద్ది శివ,బైరు శంకర్, గిరి సైదులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థల మూసివేత ఆపాలి: డివైఎఫ్ఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES