నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ను ఆమెకు అందజేసి, రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) తెలిపింది. ఇటీవల డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ వివరాలను కూడా ఆమెకు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధిపై రేవంత్ రెడ్డి దార్శనికతను సోనియా గాంధీ అభినందించారు. విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షిస్తూ, ముఖ్యమంత్రికి తన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఢిల్లీలో సోనియాను కలిసి విజన్ డాక్యుమెంట్ అందించిన సీఎం
- Advertisement -
- Advertisement -



