డీసీసీ డెలిగేట్ టి సుధాకర్..
నవతెలంగాణ – డిచ్ పల్లి : సీఎం సహాయ నిధి పేదలు, నిరుపేదలకు ఒక వరం లాంటిదని డీసీసీ డెలిగేట్ టి సుధాకర్ తెలిపారు. బుధవారం ఇందల్ వాయి మండలంలోని ఎల్లారెడ్డి పల్లి గ్రామంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదేశాల మేరకు 12 మందికి సీఎం సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు రూ.3 లక్షల 83 వేల 500 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టి.సుధాకర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కనివిని ఎరుగని రీతిలో తన వద్దకు వచ్చిన దరఖాస్తులను వెంట వేంటనే సీఎం సహాయనిధికి పంపిస్తూ.. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా త్వరితగతిన డబ్బులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేకు లాబ్దిదారుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాట్లు సుధాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్స మోహన్, లాబ్దిదారులతో పాటు కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి.. పేదలకు వరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES