- Advertisement -
నవతెలంగాణ-చారకొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ముఖ్యమంత్రి సహాయనిధి సహాయం పేదలకు ఎంతో తోడ్పాటునీస్తుందని NSUI మండల అధ్యక్షులు గోరటి శివ అన్నారు. చారకొండ మండల కేంద్రానికి చెందిన సండూరి యాదమ్మకు బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఆయన అందజేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశాల మేరకు NSUI మండల అధ్యక్షులు గోరటి శివ ఆధ్వర్యంలో యాదమ్మ కు రూ.21,500 రూపాయల చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు jcb వెంకటయ్య, కూకుడాల శ్రీనివాసు, గుండె రామకృష్ణ పాల్గొన్నారు. లబ్దిదారురాలు ఎమ్మెల్యే వంశీకృష్ణ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -



