సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ
నవతెలంగాణ – మల్దకల్:
సీఎం సహాయక నిధి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో అండ అని కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ సరితమ్మ అన్నారు. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంప్ కార్యాలయంలో అబ్దుల్ ముజీబ్ రూ.60,000/- నర్సింహులు కోతులగిద్ద రూ.13,500/-, నవీన్ కుమార్ గౌడ్ రూ.16,000/-, ముష్టి రమేష్ రూ.60,000/- సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసినారు. అనంతరం సరితమ్మ మాట్లాడుతూ.. ప్రసుత సిఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల చేసి, వారికి అండగా ఉంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
సీఎం సహాయక నిధి.. పేద ప్రజలకు వరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



