- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు భరోసానిస్తుందని కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కల్లెపల్లి వెంకటస్వామి అన్నారు. బుధవారం హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొట్లపల్లి గ్రామంలో నలుగురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ రూ.లక్ష 23 వేల వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మార్క అనిల్ గౌడ్, దేవసాని నిర్మల నరసింహారెడ్డి, గాలి పెళ్లి శ్రీనివాస్, దామోదర్ రెడ్డి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -