- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు కెమికల్ ఫ్యాక్టరీ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరాదీశారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సీఎం.. బిల్డింగులో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. మరో వైపు ఘటనా స్థలం దగ్గర జరుగుతోన్న రెస్క్యూ ఆపరేషన్ ను మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించారు. కాసేపట్లో మంత్రి వివేక్ వెంకటస్వామి ఘటనా స్థలానికి వెళ్లనున్నారు.
- Advertisement -