- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి నేడు హన్మకొండలోని వడ్డేపల్లిలో జరిగే ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొననున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి స్మారక కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పిస్తారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హన్మకొండకు చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం సీఎం తిరిగి నగరానికి చేరుకుంటారు.
- Advertisement -